వైసిపి దౌర్జన్యాలను, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు

  • సిద్ధవటం మండల జనసేన ఇంచార్జ్ కొట్టే రాజేష్

రాజంపేట నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు వచ్చిన అశేష స్పందనను చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం  సిద్ధవటం మండల జనసేన ఇంచార్జ్ కొట్టే రాజేష్ ఖండించారు. సిద్ధవటం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం కొట్టే రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన తొలిదశ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగింది. వారాహి యాత్రలో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిపై వైసిపి ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. బటన్ నొక్కడం తప్ప రాష్ట్ర అభివృద్ధి శూన్యం అని పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీ చరిత్ర తెలుసుకొని మనం ఎంతవరకు కరెక్టుగా ఉన్నామా అని మాట్లాడాలని, అధికారం శాశ్వతం కాదని, మీ దౌర్జన్యాలను మీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్ లు పెట్టాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే దానికే ప్రెస్ మీట్ లు పెడుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ మీట్ లు పెట్టడం లేదని కొట్టే రాజేష్ తెలియజేశారు.