రైతులకు ఎరువుల కొరతపై పెనుగొండ మండల జనసేన పార్టీ వినతిపత్రం

పశ్చిమగోదావరి, పెనుగొండ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు కంబాల బాబులు నేతృత్వంలో రైతులకు ఎరువుల కొరత వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ పెనుగొండ మండలం వ్యవసాయ అధికారికి మరియు మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కంబాల బాబులు మాట్లాడుతూ… రైతులకు ఎరువుల కొరత తీర్చకపోతే, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, పెనుగొండ పట్టణ అధ్యక్షులు యర్రంశెట్టి బాబురావు, రామన్నపాలెం ఎంపీటీసీ మొఖమాట్ల కృష్ణకాంత్, వడలి గ్రామ అధ్యక్షులు బొర్రా నాగేంద్ర, వీరమహిళ మేకల చంద్రకుమారి, దార్లంక మారుతీ, బళ్ళ మాధవ్, సానబోయిన మోహన్, తోట సతీష్, కొండవీటి శ్రీనివాసరావు, బొరుసు సర్వేశ్వరరావు, ఏడిద కుమార్ స్వామి, పోలనాటి మల్లికార్జునరావు, మారిశెట్టి భార్గవ్, అందాల అయ్యప్ప, బన్ని, బాలస్వామి, తోట సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.