ఆంజనేయస్వామి ఆలయ ఆవిష్కరణలో పాల్గొన్న జనసేన పార్టీ ఏలూరు ఇంఛార్జి

ఏలూరు నియోజకవర్గంలోని 12వ డివిజన్ లో ఉన్న దక్షిణపు వీధిలో ఆంజనేయ స్వామి వారి ఆలయ ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యుడు బోండా రాము నాయుడు, నాయకులు తుమరాడ రమణ, జంగం కృపానందం, శివ సాయి కోడిదాసు తదితరులు పాల్గొన్నారు.