తోటబడి కార్యక్రమంలో జనసేన నాయకులు రామశ్రీనివాసులు

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో మామిడి తోటల రైతులకు తోట బడి కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించడానికి ముఖ్య అతిథిగా ఎం.ఐ.డి.సి జిల్లా కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, రైతు భరోసా కేంద్రం సుండుపల్లి ప్రతినిధి మల్లికార్జున, వివిధ రకాల శాఖల రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి రైతులతో సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామశ్రీనివాస్, సీఈఓ ఎం. రమణయ్య, రామంజులు, గంతల చెన్నకృష్ణ, ఆర్ వీరణగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.