రంపచోడవరంలో “ప్రజల్లోకి జనసేన”

రంపచోడవరం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని బలోపేతం చేసే విధంగా “ప్రజల్లోకి జనసేన” పేరుతో జనంలోకి వెళ్లేవిధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రజలు నమ్ముతున్నారని పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి ప్రణాళిక చేస్తునట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ కొద్ది కాలమే కీలకమని, జనసేన నాయకులు, జనసైనికులు మండల నాయకత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని, ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. 8వ తారీఖు నుండి పంచాయతీల వారీగా ప్రజలను కలుస్తామని పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కెచ్చల పోసిరెడ్డి, ముంజపు శ్రీరామ్, మండల యూత్ నాయకులు పెడపెట్ల పవన్ కళ్యాణ్, రేవు దుర్గాప్రసాద్, ముంజపు సాయి, పట్టి వెంకట రత్నం, సాగర్ పాల్గొన్నారు.