నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన కైకలూరు జనసేన నాయకులు

మంగళగిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ (పీఏసీ) గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు.

పార్టీ బలోపేతం కోసం కష్టపడిన, కష్టపడుతున్న ప్రతి జనసైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలానే పెద్దలు ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య నాయకత్వంలో కార్యకర్తలు జనసైనికులు అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు.

ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు కృష్ణాజిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ, కైకలూరు నియోజకవర్గ నాయకులు మోటేపల్లి హనుమాన్ ప్రసాద్, బసింసెట్టీ కిషోర్, మండల గౌరవ అధ్యక్షులు పోకల కృష్ణ, మండల ఉపాధ్యక్షులు వర్రే హనుమాన్, ఎర్రంశెట్టి శివప్రసాద్, అంబుల భరత్, విజయ్ పాల్గొన్నారు.