జనసేన, టీడీపీ క్యాన్సర్ అవగాహనా సదస్సు

తిరుపతి: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం “సందర్బంగా తిరుపతిలో 7వ వార్డులో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి జె ఎస్ పి శ్రీమతి డా. స్వప్నప్రియ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ అంటే ఏమిటీ..?, క్యాన్సర్ ఎందుకు వస్తుంది?, ఏయే క్యాన్సర్లు ఎలా ఏర్పడతాయి?, క్యాన్సర్ లక్షణాలు ఏమిటీ?, క్యాన్సర్ని ఎలా అధిగమించాలి..?, క్యాన్సర్ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి ..?, క్యాన్సర్ నిర్ధారణ ఐతే ఎలా ధైర్యంగా నిలబడాలి..?, మన లైఫ్ స్టయిల్ని ఏ విధంగా మార్చుకోవాలి!!, అవగాహన కల్పించండం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు బ్యాంకు శాంతమ్మ, జనసేన తిరుపతి ప్రధాన కార్యదర్శి దుర్గ, కార్యదర్శి చందన, 1వ వార్డు అధ్యక్షుడు వంశీ టీడీపీ 7వ డివిజన్ అధ్యక్షురాలు 7వ వార్డు మహిళలు పాల్గొన్నారు.