చామవరం గ్రామంలో ప్రజలకు త్రాగునీరు అందించిన ప్రత్తిపాడు జనసేన

ప్రత్తిపాడు, గత నాలుగు రోజుల నుండి అధికార పార్టీ నిర్లక్ష్యపుధోరణి వల్ల రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో ప్రజలు త్రాగునీరు అందక ఇబ్బంది పడటంతో అక్కడ స్థానిక జనసైనికులు మన ప్రత్తిపాడు జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు దృష్టికి తీసుకురావడంతో ప్రస్తుతానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ ను ఇన్చార్జి సహకారంతో జనసైనికులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్, ప్రత్తిపాడు నియోజకవర్గం యువ నాయకులు సాయి కిరణ్, జిల్లా పార్టీ కార్యక్రమాల నిర్వహణ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండలం అధ్యక్షులు గాబు సుభాష్, ఏలేశ్వరం మండలం జనరల్ సెక్రెటరీ మరియు సోషల్ మీడియా కన్వీనర్ గంగిరెడ్ల మణికంఠ, మెరక చామవరం జనసేన పార్టీ నాయకులు రాసంశెట్టి అర్జునరావు జనసైనికులు సింగిరెడ్డి మణికంఠ, కోట విష్ణు, ఆచంట శివ, గాది శివ, గాది రామదత్త, ఆచంట సూర్య, అడపా వంశీ, బెల్లపుకొండ ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.