ప్రమాదంలో మరణించిన జనసైనికుని కుటుంబానికి భీమా సాయం

నిడదవోలు నియోజకవర్గం, వడ్లూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మేడపాటి దుర్గాప్రసాద్ ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం పరామర్శించి, ఓదార్చారు. దుర్గాప్రసాద్ తల్లి శ్రీమతి కొండమ్మకు రూ.5 లక్షల భీమా సాయం చెక్కును అందజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా అద్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పి.ఎ.సి. సభ్యులు చేగొండి సూర్యప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి ఘంటశాల వెంకట లక్ష్మీ, ఏలూరు ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా నేతలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.