క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు బుక్కూరు గ్రామంలో జనసైనికులకు ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.