ప్రచార కమిటీ ఆత్మీయ సమావేశం

ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ జడబాల నాగేంద్ర అధ్యక్షతన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ముఖ్య అతిధిగా ప్రచార కమిటీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ జడబాల నాగేంద్ర వారి అనుభవాన్ని జనసైనికుల కూడా పంచుతూ వినూత్న రీతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేయాలని, దానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని, కొద్దిరోజుల్లో విడుదలయ్యే ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రక్రియలో జడబాల నాగేంద్ర జనసైనికులను సమన్వయం చేసుకొని కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, సంతనూతలపాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కందుకూరి బాబు, కొండేపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనోజ్, కనిగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగిశెట్టి బ్రహ్మయ్య, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, మొహమ్మద్ యూనిస్, కళ్యాణ్ ముత్యాల, కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల, దండే అనిల్, కందుకూరి వాసు, సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్ మరియు నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.