పేదవాళ్ళు ప్రభుత్వానికి అవసరం కాని పేదవాళ్ళకి మంచి ఇల్లు అవసరం లేదు అనడానికి నిలువెత్తు నిదర్శనం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండల పరిధిలోని నిరుపేద అయిన సెల్వి కుటుంబానికి జగనన్న కాలనీలో ఇల్లు ఇవ్వని ప్రభుత్వం. న్యాయం చేయండి నాకు ఇల్లు కావాలి అని అడిగిన పట్టించుకోలేదు అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు కనపడలేదా మీకు ఈ పేద కుటుంబం, కనపడలేదా ఈ పూరి గుడిసె. అన్ని అర్హతలు ఉండి కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వని పరిస్థితిని చూస్తున్నాం. సెల్వి కుటుంబానికి న్యాయం చేయాలని మండల అధికారులకు, అధికార పార్టీ నాయకులకు జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ డా.యుగంధర్ పొన్న మరియు కార్వేటినగరం మండలం అధ్యక్షులు శోభన్ బాబు పొన్న, మండల టౌన్ అధ్యక్షులు గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి పాల్గొన్నారు.