జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రక్షిత మంచి నీరు..

  • నెల్లిమర్ల నియోజవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో ఉచిత రక్షిత మంచి నీరు
  • దాహం దప్పికతో అలమటిస్తున్న ప్రజలకు ట్రాక్టర్ ద్వారా ఉచిత మంచి నీటి సరఫరా…
  • నీటి రుణం తీర్చుకోలేనిది..నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం కొండరాజు పాలెం గ్రామ ప్రజల ప్రశంసలు

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ శ్రుతిమించి పోతున్నాయి.. అందుకు నిదర్శనమే ఈ కొండరాజు పాలెం గ్రామం.. వైసీపీ నాయకుల మాట వినలేదు అనే ఉద్దేశంతో వేసవి కాలం వేళ ఆ గ్రామంలోనీ ప్రజలను ఇబ్బందికి గురిచెయ్యాలనే ఉద్దేశంతో ఆ గ్రామంలో మంచినీటి సరఫరా నిలిపివేశారు. ఈ విషయాన్ని గ్రామస్థులు జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి దృష్టికి తీసుకురావటం జరిగింది. వారి ఇబ్బందులు చూసి చలించిపోయిన లోకం మాధవి పేద కుటుంబాలపై నీటి భారాన్ని నివారించాలి అనే సంకల్పంతో జనసేన రక్షిత మంచినీటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గడిచిన వారం రోజుల నుండి ప్రతీ రోజు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం ట్రాక్టర్ల ద్వారా రక్షిత మంచి నీరు పంపిణీ చెయ్యటం జరుగుతుంది. ఇటువంటి సేవా దృక్పథంతో మంచి నీరు అందించినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా భారీ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, ప్రజలతో ఎప్పుడు మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ.. వారికి అండగా నిలబడింది అంటే అది ఒక్క జనసేన పార్టీ అని, లోకం మాధవి గారి లాంటి నాయకులను మేము ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని, ఇలాంటి వారిని గెలిపించుకుంటామని.. జనసేన అంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని మరొక్కసారి నిరూపించిన లోకం మాధవి గారు అని తెలిపారు.