పోలవరంలో జనం కోసం జనసేన 76వ రోజు

పోలవరం మండలంలో 76వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమం మండల అధ్యక్షులు చిన్ని, జిల్లా కార్యదర్శి పాదం కృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు టౌన్ లో ప్రతి ఒక్కరికీ జనసేన మేనిఫెస్టో, అలాగే తాము అధికారంలోకి రాగానే చేసే పనులు గురించి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు తమ ప్రభుత్వం చేసే మంచి పనులు ఏంటో వివరించడం జరిగింది. ప్రస్తుత అధికార ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియోజకవర్గంలో తాను చేసిన మంచి ఏంటో ఒక్కసారి చెప్పాలి అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్తారని, కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని మార్పు మొదలవ్వడం ఖాయమని చిర్రి బాలరాజు తెలిపారు. పోలవరం టౌన్ లో ఎక్కడా అభివృద్ధి లేదని, డ్రైనేజి సిస్టమ్ అస్తవ్యష్టంగా ఉందని, కనీసం చుట్టూపక్కల ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపాక కేంద్రం లేదని, తాము అధికారంలోకి రాగానే అన్ని వసతులూ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖె నాగు, మామిడిపల్లి స్వాతి, మామిడిపల్లి ప్రసాద్, అనిశెట్టి రాదయ్య, బాబీ, రాము కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.