విద్యుత్ చార్జీలు, పెంపు, అప్రకటిత విద్యుత్తు కోతలకు కొవ్వొత్తులతో నిరసనగా

విశాఖ ఉత్తరం నియోజకవర్గం, విద్యుత్ చార్జీలు, పెంపు, అప్రకటిత విద్యుత్తు కోతలకు నిరసనగా, ఆదివారం విశాఖ ఉత్తరం నియోజకవర్గ జనసేన 43,44 వార్ద్ జనసేన నాయకుల ఆద్వర్యంలో నందగిరినగర్ నుంచి మహరనిపార్లౌర్ వరకూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన నార్త్ ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ , ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంధకార ప్రదేశ్ గా మారిపొయింది, కరెంట్ బిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి, ఈ దుస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం, ప్రభుత్వం తక్షణము పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి, కోతలు ఎత్తివెయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పడాల పరమేశ్వరరావ్, గుడ్లమురళి, నాగరాజు, కార్పొరేటర్ అభ్యర్థులు నీరుకొంద దివాకర్, అడబాల లక్ష్మి, బోడసింగి శ్రీధర్, గుడివాడ అప్పారావు, రామరాజు, తుమ్మల త్రినాధ్, జనసైనికులు, వెంకటేష్, విఠల్, మురళి, సాగర్, మాణిక్యం, పార్థసారధి, శంకర్ మహంతి, గారపాటి లక్ష్మి పాల్గొన్నారు.