పూతలపట్టు జనసేన ప్రచార ప్రణాళిక

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, జనసేన పార్టీ పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేయడానికి, ప్రతి గ్రామంలో మండల కమిటీ నాయకులు అధ్యక్షుల ఆధ్వర్యంలో పర్యటించడానికి ప్రణాళికను రూపొందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమ వివరాలను నియోజకవర్గ వ్యవహారాలను చూసుకుంటున్న జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ తో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి తులసి బాబు, సీనియర్ నాయకులు తమ్మిశెట్టి మోహన్ బాబు, యువ నాయకులు మైలారి వినయ్, చందు మరియు జనసైనికులు పాల్గొన్నారు.