పితాని వెంకటేశ్వరరావును పరామర్శించిన రాజేశ్వరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, శివకోటి గ్రామానికి చెందిన పితాని వెంకటేశ్వరరావు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. మంగళవారం జనసేన నాయకులు రాజేశ్వరావు బొంతు కిమ్స్ హాస్పిటల్ లో వెంకటేశ్వరావు గారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని సంబంధిత డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి, వెంకటేశ్వరరావు గారు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ధైర్యం చెప్పారు. ముప్పర్తి నాని ప్రసాద్, తోట త్రిమూర్తులు, ముస్కుడి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.