రోగులకు సేవ చేసే భాగ్యం వెలకట్టలేనిది: శ్రీమతి పాలవలస యశస్వి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో శుక్రవారం జరిగిన విజయ్ ఇన్స్టిట్యూట్ అఫ్ నర్సింగ్ సైన్సెస్ కళాశాల లో నర్సింగ్ విద్యార్థినుల “క్యాపింగ్ సెర్మని 2023” కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ మరియు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఉపాద్యక్షులు డా.విశ్వక్షేన్ ఆహ్వానం మేరకు కార్యక్రమ విశిష్ట అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి, జనసేన-టిడిపి జెఏసీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా యశస్వి నర్సింగ్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ. నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న మీరు భవిష్యత్ లో మరింత వృత్తిలో రాణించాలని కోరారు. రోగులకు సేవ చేసే భాగ్యం వెలకట్టలేనిదని, మానవ సేవే మాధవ సేవ అనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడీ కళా వెంకటరావు, తెదేపా శ్రీకాకుళం ఇంచార్జ్ గుండా లక్ష్మి పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.