శ్రీశ్రీశ్రీ నాగరపమ్మ జాతరలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: టి. సుండుపల్లి మండల పరిధిలో పెదినేనికాలువ పంచాయితీ, బెస్తపల్లి నందు ఈడిగపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ నాగరపమ్మ వారి జాతర సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అమ్మవారికి భక్తాదులు, బోనాలు, సమర్పణలు, మొక్కులు చెలించుటకు, వివిధ రకాల సాంస్కృతి సంప్రదాయం ప్రకారం విద్యుత్ దీపాలంకరణలతో చాందని బండ్లు, చక్కభజనలు, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా చుట్టు పక్కల గ్రామస్థులు, మండల, తాలూకా, జిల్లా స్థాయిలో అందరూ కలిసి భక్తులు మొక్కులు చెలించుటకు ఘనంగా జాతర మహోత్సవంలో భారీ ఎత్తున భక్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, స్థానికులు, గ్రామస్థులు, యువకులు, మహిళలు, జిల్లా స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.