సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన జనసేన నాయకులు

పాడేరు: అల్లూరి సీతారామరాజు (జిల్లా) పెదబయలు మండలం, వనభంగి పంచయతీలోని కీర్తిశేషులు వడ్డే నవీన్ కుమార్ జ్ఞాపకార్థం సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో సుమారుగా పదిరోజుల పాటు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారి ప్రతిభను కనబర్చుకున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ.. మన గిరిజన ప్రాతంలో ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరికి ఏదోక ప్రతిభను కలిగి ఉన్నారు. క్రీడలలో గాని మరియు ఇతర విషయాలలో మంచి టాలెంట్ కలిగిన గిరిజన బిడ్డలు ఉన్నారు. వారిలో దాగివున్న ప్రతిభను బయటకు చూపించాలి అంటే మన గిరిజన ప్రాతంలో ఇలాంటి క్రీడలు ముందు ముందు ఇంకా జరిగితే తప్పకుండా గిరిజన ప్రాంతానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. యువకులకు రానున్న రోజుల్లో మన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునివ్వటం జరిగింది. ఈ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో గెలుపు పొందిన వై పేడపల్లి గ్రామ క్రీడాకారులకు మొదటి బహుమతిగా 10.000 రూపాయలు అందించడం జరిగింది, అలాగే రెండో బహుమతిగా (బీ) టీం వనబంగి గ్రామం క్రీడాకారులకు జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ అలాగే వనబంగి సర్పంచ్ మరియు గ్రామస్తుల చేతులు మీద బహుమతి అందించటం జరిగింది.