గంగమ్మ దేవి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పరిధిలోని టి. సుండుపల్లి మండలం, మడితాడు గ్రామంలో శ్రీ నడివీధి గంగమ్మ దేవి స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గ్రామస్థులు మరియు గుడి నిర్వాకులు రాజేంద్రప్రసాద్ రాజు ఆహ్వానం మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయులు ధర్మరాజు, రెడ్డయ్యరాజు నడివీది స్థిర ప్రతిష్ట కార్యక్రమంలో అతిథులుగా భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సనాతన ధర్మ ప్రతినిధులు సుండుపల్లి మండల జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామపెద్దలు,స్థానికులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.