రామయ్య ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న పితాని

  • అయోధ్య రామాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా పలు రామాలయాలలోనూ, ఆంజనేయ స్వామి గుడిలోనూ పూజాకార్యక్రమంలో పాల్గొన్న పితాని..

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం: అయోధ్య రామాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో అభయాంజనేయ స్వామి వారి గుడిలో జరిగిన పూజాకార్యక్రమంలోనూ, అఖండ హారతి కార్యక్రమంలోనూ, ఐ పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో రామాలయంలో పూజా కార్యక్రమంలోనూ, కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఆంజనేయస్వామి వారి గుడిలో పూజా కార్యక్రమంలోనూ పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జున రావు, రంబాల రమేష్, రంబాల చౌదరి, నూకల దుర్గ బాబు, పిల్లి గోపి, విళ్ల శివ, భీమాల సూర్య, సలాది రాజ, పితాని రాజు, కోలా నరేష్, మాదాల శ్రీధర్, పాయసం సాయి, సాధనాల భాస్కరరావు, కోలా రామారావు, వీరేశ్వరరావు, మాగాపు మల్లేష్, మాగాపు పట్టాభి, కడలి సత్యనారాయణ, కోలా మణికంఠ, ఆచంట సతీష్ మొదలగువారు పాల్గొన్నారు.