నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసిన రామాంజనేయులు

మదనపల్లె: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా మదనపల్లె జనసేన నాయకులు రామాంజనేయులు గురువారం కలిసారు. నాగబాబు గారి సూచనల మేరకు మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అలాగే నాగబాబు గారు ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తానని, మదనపల్లె నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి జనసేన గెలుపుకు తన శాయశక్తులా పని చేస్తానని ఈ సందర్భంగా రామాంజనేయులు తెలిపారు.