కిడ్నీ పేషెంట్ కు ఆర్థిక సహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు సలాది సత్తిబాబు అనే లాజరు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్న పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు గురువారం ఉప్పాడ కొత్తపల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి వెళ్లి సలాది సత్తిబాబు స్వగ్రాహానికి వెళ్లి సత్తిబాబుకు కిడ్నీ వ్యాధి సమస్యపై వైద్యం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేసి, సలాది సత్తిబాబు వైద్య నిమిత్తం కొంత నగదును ఇచ్చారు. నగదుతో పాటుగా కిరాణాసామాన్లు, 25 కేజీల బియ్యాన్ని అంబేద్కర్ యువజన సంఘం సభ్యుల సమక్షంలో సలాది సత్తిబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోన కృష్ణ, లాజర్, ఆకుల శివ, పట్నాల కేశవ్, రాయుడు సాయి, ఆకుల సురేంద్ర జ్యోతుల సీతారాంబాబు, గంటా గోపి, జ్యోతుల శివ, కీర్తి చిన్న, వీర్ల శ్రీనువాసు తదితరులు పాల్గొన్నారు.