గుంటూరు జనసేన ఆద్వర్యంలో జ్యోతిరావు పూలే కు ఘననివాళులు

గుంటూరు: జ్యోతిరావు పూలే స్పూర్తితో ముందుకు సాగుతాం గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అణగారిన వర్గాల అభ్యున్నతికై తన జీవితాన్ని అంకితం చేసి, అంటరానితన, కుల వివక్ష నిర్మూలన కోసం, మహిళోద్దరణకై జీవిత పర్యంతం పాటుపడిన భారతదేశ ప్రధమ సామాజిక వేత్త జ్యోతిరావు పూలే ఆశయసాధనే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు హిందూ కాలేజీ కూడలిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ మహిళలకు, తక్కువ కులాల వారికి విద్యను అందించాలన్న దృఢ సంకల్పంతో దేశంలోనే మొదటి మహిళా విద్యాలయాన్ని నెలకొల్పిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే అందించిన స్పూర్తితో సమసమాజ స్థాపనకై కృషి చేస్తామని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, బీసీ నాయకులు దొంత నరేష్, 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, కోలా అంజి, వడ్డె సుబ్బారావు, పురాణం కుమారస్వామి, శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.