జనసేన రాజగోపాల్ ని పరామర్శించిన రాయచోటి జనసేన నాయకులు

కడప జిల్లా, సుండుపల్లి మండల జనసేన నాయకుడు రాజగోపాల్ కుడి కాలు మోకాళ్ల దగ్గర సర్జరీ జరిగి అల్లా, దేవుడు, జీసస్ దయ వల్ల రికవర్ అవుతున్నారు. ఈ సందర్భంగా జనసేన రాజ గోపాల్ ని కలిసి వారి ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది అని అడిగి తెలుసుకొని మనం అంతా జనసేన కుటుంబం అని ఒక్కరికీ ఒక్కరూ తోడుగా నీడగా ఉంటామని రాజగోపాల్ కి భరోసా కల్పించి పరామర్శించిన రాయచోటి నియోజకవర్గం జనసేన నాయకులు పఠాన్ మహమ్మద్ అలీ, కిరణ్ కుమార్, నాగేంద్ర, బిజేవైఎం నాయకులు శివ శంకర్.