భవానీ రవికుమార్ స్పందించాడు.. సాయం అందించాడు..

అనంతపురం పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కి చెందిన కొండప్ప సతీమణి ఇటీవలి కాలంలో అనారోగ్యంతో మృతి చెందగా.. ఒంటరిగా ఉంటున్న కొందప్ప మనోవేదనతో అనేక రకాల జబ్బులకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులూ ఉండడంతో నిస్సహాయుడుగా ఉన్న కొండప్ప కు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు భవానీ రవికుమార్ ని కలసి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సాయం కోరగా భవానీ ఆయనకు కొంత నగదును ఇవ్వడం జరిగింది. భవానీ రవికుమార్ చేసిన ఈ సాయం వల్ల అతనికి కొండంత అండగా నిలుస్తుంది.

దైవం మానుష రూపేణ అంటే అది నిజమే అని భవానీ రవికుమార్ చూపించి మరీ ఇతరులకి చెప్ప వచ్చు.. ఈ విషయంలో ఆయన అభిమానులు ఎంతో గర్వపడతారు.