జనసేనలో చేరిన ఆర్.టి.సి విశ్రాంత ఈ.డి. ఎమ్.వి.రావు

ఏ.పీ.ఎస్. ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈ.డి.) గా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన ఎమ్. వెంకటేశ్వర రావు జనసేన పార్టీలో చేరారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఎమ్.వి.రావు సుదీర్ఘ కాలం ఆర్.టి.సి లో అధికారిగా పని చేశారు. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ‘జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజాపక్షంగా ఉన్నాయి అని, పార్టీకి సంబంధించిన క్రమాలలో క్రియాశీలకంగా పని చేస్తూ.. పార్టీ విధి, విధానాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తాను’అని తెలిపారు.