జనసేన కార్యాలయంపై వైసిపి గుండాల దాడిని ఖండించిన సాయిబాబా దురియా

అరకు నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంఫై వైసిపి పార్టీ గుండాల దాడిని రాజకీయ పార్టీల కతీతంగా, ప్రజాసంఘాల కతీతంగా ప్రతి ఒక్కరు వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలలో రాయలసీమ ఫ్యాక్షన్ తరహా వాతావరణం సృష్టించి వైసిపి గుండాలు అసమర్థతని ప్రశ్నించే నాయకులను దాడులు చేయించడం, వార్త కేసులు బనాయించడం ప్రభుత్వం కుట్ర భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సంబంధిత పోలీస్ శాఖ వారు నిస్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వైసీపీ గూండాలను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకపైన ఈ దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యతవహించాలని తెలిపారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో ఈ ప్రభుత్వానికి అలా చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపారు.