పలువురిని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులకు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా చేబ్రోలు గ్రామం నందు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కర్రి జోగారావు సతీమణి, కర్రి నాగ సూర్యవతిని పరామర్శించడం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి జనసేన కార్యకర్త పెద్దింటి శివ అన్నయ్య పెద్దింటి తరుణ్ కుమార్ కి యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి తరుణ్ కుమార్ ని కూడా పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్రి శివ, శివలంక బ్రహ్మరాజు, సకినాల నాగ శివ గణేష్, వద్దినేటి రమేష్ రమేష్, సకినాల రాజా రమేష్, గేరగ నవీన్, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.