జనసేన పార్టీ లో చేరిన సలాది శ్రీనివాస్ బాబా

కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం మాజీ ఉప సర్పంచ్ మరియు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు సలాది శ్రీనివాస్ బాబా నేడు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో విజయవాడలో జనసేన పార్టీ లో చేరారు. వారికి జనసేన పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలియచేసిన నాదెండ్ల మనోహర్.