ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఏదీ?.. బోత్సను ప్రశ్నించిన మత్స పుండరీకం

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం మీడియాతో మాట్లాడుతూ గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత అడుగుపెడుతున్న ప్రతి సారి వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడుకి, నాయకులకు వెన్నులో వణుకుపుడుతుఒది. శ్రీ పవన్ కళ్యాణ్ ని నేరుగా ఎదుర్కోలేక కులం, పెళ్లిళ్లు గురించి మాట్లాడతారు మీరు ఓ రాజకీయ పార్టీ నాయకులు, జనసేన పార్టీ సెలిబ్రిటీ పార్టీ కాదు – వైస్సార్సీపీ పార్టీ కి చెమటలు పుట్టిస్తున్న పార్టీ మా జనసేన పార్టీ అని అన్నారు. వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ కి నాయకులు బోత్స సత్యనారాయణ గారు ఈ ప్రశ్నలకు మీ సమాధానం చెప్పఒడి. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శేసనమండలి రద్దు చేయాలి రాష్టప్రతి ఆర్జి పెట్టుకుంది మీరు కదా?, ప్రస్తుతం రాష్ట్రంలో శసనమండలి ఎన్నికల్లో పోటీ చేసియున్నారు ఎందుకు?, ఉత్తరాంధ్ర లో ఎమ్మెల్సీ అభ్యర్థి గా బీసీ లకు ఎందుకు మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు బొత్స గారు?, శ్రీకాకుళం జిల్లా అత్యధిక జనాభా ఉన్న తూర్పుకాపు లకు మీ వైస్సార్సీపీ పార్టీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో తూర్పుకాపు లకు ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు?, మీ ప్రభుత్వం లో ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వాటికి నిధులు లేకుండా చేశారు మీ పార్టీకి బీసీలు బ్యాక్ బోన్ అంటూ చెప్పుకుఒటున్నారు హాస్యాస్పదంగా ఉంది బోత్సగారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేస్తూ కులం అంటగాడుతూ మాట్లాడుతూ వుండం మీ వైస్సార్సీపీ కి వెన్నతో పెట్టిన విద్య. నీతి నిజాయితీ లు ఉండబట్టే వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పదహారు నెలలు జైలు జీవితం గడిపారు అని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి కాపుల పార్టీ కాదు – బాధిత, పీడిత, బడుగు బలహీన వర్గాల పార్టీ అని మత్స పుండరీకం అన్నారు.