పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం విద్యార్థుల పక్షాన పోరాడిన సంపత్ నాయక్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2017 లో ఉన్న పాత పద్దతిలో పిహెచ్డి నోటిఫికేషన్ విడుదల చేయాలని తమ న్యాయమైన హక్కును అడుగుతున్న విద్యార్థులని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో బంధించిన సందర్భంలో విద్యార్థుల పక్షాన జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ పోరాడి.. వైస్ ఛాన్సుల్లెర్ కార్యాలయాన్ని ముట్టడించి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ తో ఆగస్టు1 న పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టమైన హామీ తీసుకోవడం జరిగింది. అదే విధంగా విద్యార్థులపై పెట్టిన కేసులను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నగేష్, గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మహేష్ పెంటల, ఉస్మానియా జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ నాయక్, జనసేన విద్యార్థి నాయకులు పొన్నం పవన్, చిరంజీవి పాల్గొన్నారు.