తాటియాకులగూడెంలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

జీలుగుమిల్లి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జీలుగుమిల్లి మండలం, తాటియాకులగూడెంలో గ్రామంలో మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పాల్గొన్న మహిళలందరికి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. రైతులు అందరు కష్టపడి పండించిన పంట ఇంటికి తీసుకు వచ్చి కుటుంబంతో కలిసి చేసుకునేది సంక్రాంతి అని, జూదం జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని, రంగువల్లులు, క్రీడా పోటీలు నిర్వహించాలనే గొప్ప ఉద్దేశంతో సంక్రాంతిని అందరం సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, మహిళలు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.