జనచైతన్య ట్రస్ట్ రక్తదాన శిబిరంలో పాల్గొన్న సరికొప్పుల నాగేశ్వరరావు

హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల యూత్ ఆధ్వర్యంలో జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన తరఫున జనసేన పార్టీ హుజుర్ నగర్ కో ఆర్డినటర్ సరికొప్పుల నాగేశ్వరరావు పాల్గొని రక్తదానం చేసిన వారికి ఓఆర్ఎస్ పాకెట్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దేవి రెడ్డి నాగిరెడ్డికి మరియు జన చైతన్య ట్రస్ట్ నంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, రక్తదానం పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ హుజూర్నగర్ కార్యనిర్వాకులు సరికొప్పుల నాగేశ్వరరావు మరియు జనసైనికులు సాయి చరణ్ అనిల్ జనసేన చైతన్య ప్రస్తుత సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.