స్మశానవాటిక గురించి ఎంపీడీవోని కలిసి వినతిపత్రం ఇచ్చిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని ఎంపీడీవోని కలిసి వినతిపత్రం ఇచ్చిన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బోబ్బెపల్లి సురేష్ బాబు, కాకి శివ కుమార్. జనసేన నాయకులు మాట్లాడుతూ సర్వేపల్లి గ్రామపంచాయతీలోని 5 కులాల వారు వినియోగించుకునే స్మశాన వాటిక సర్వేనెంబర్ 1606లో ఉంది అయితే ఆ యొక్క స్మశానానికి వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయి కంపచెట్లతో మురికి నీరుతో నిండిపోయి మురికి కాలువలాగా తయారయింది. దయచేసి ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు కనీసం గ్రావెల్ తో రోడ్డుని నిర్మించి ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా స్మశానం ఏదైతే ఉందో వర్షాకాలంలో వర్షంతో నిండిపోయిన చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి చుట్టూ ప్రహరీ గోడను కూడా నిర్మించాలని వారిని కోరారు. ఆ విషయం పై ఎంపిడిఓ పూర్తిస్థాయిలో స్మశానానికి సంబంధించిన వివరాలను సేకరించి అభివృద్ధి చేయడానికి తోడ్పడుతమని అని చేప్పడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే మా జనసేన పార్టీ నుంచి మేము సొంత నిధులతో నిర్మించుకునే దానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పినిశెట్టి మల్లికార్జున, శివ రాత్రి సందీప్, అవినాష్ రెడ్డి, వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.