వీరఘట్టం జనసేన మండల స్థాయి సమావేశం

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు సమక్షంలో వీరఘట్టం మండల జనసేన నాయకులు, కార్యకర్తలతో, సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు సత్తిబాబు మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో గడప గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తీసుకెళ్లే విధంగా కార్యచరణ చేపట్టాలని, కౌలు రైతుల భరోసా యాత్ర మొదలైనటువంటి అంశాలను ప్రజలకు వివరించవలసిన అవసరం ఉందని.. పార్టీ ప్రయోజనాల కోసం అందరూ కలిసి పని చేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ సమావేశంలో వీరఘట్టం మండలం జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, రౌతు గోవిందరావు, కెవిఆర్ నాయుడు, సుమన్, వీరమహిళ సొండి అమల, రాజు తదితరులు పాల్గొన్నారు.