బోనాల ఉత్సవాలలో పాల్గొన్న శేరిలింగంపల్లి జనసేన

శేరిలింగంపల్లి నియోజకవర్గం: బోనాల ఉత్సవాల సందర్భంగా శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఉత్సవాలలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మాధవరెడ్డి జనసేన కార్యకర్తలతో బోనాల ఉత్సవాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బోనాల ఉత్సవాలను మనం ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం అని, జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే విషయంలో ముందు వరుసలో ఉంటారని, వారు ప్రత్యేకించి అమ్మ వారి భక్తులని, పదే పదే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పలు వేదికల మీద అభినందించిన విషయం కూడా మనం చూసామని, బోనాల పండుగ అనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో, తెలంగాణ ప్రజలలో అంతర్భాగం అయిపోయిందన, ఈ బోనాల ఉత్సవాన్నిఊరు వాడా, చిన్నా పెద్ద అందరూ కూడా భగ్యనగరమంతా భక్తి శ్రద్దలతో కుటుంబమంతా కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంగా బోనాల పండుగను నిర్వహించుకుంటున్నారు. గౌరీ మాత, ఎల్లమ్మ తల్లి, కాళీ మాతలను మరియు స్త్రీ ని శక్తి గా పూజిస్తున్నాం, ఆ దేవతలను శక్తిగా భావించి జరుపుకునే ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగి, మన జీవితాలలో మనకు ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కునే శక్తిని మనందరిక ప్రసాదించాలని కోరుకుంటున్నామని, ఆ తల్లుల ఆశీస్సులు మన శేరిలింగంపల్లి ప్రజానీకంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. బోనాలు పండుగ వేడుకలలో పాల్గొన్న కళ్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, కృష్ణ, హనుమంతు నాయక్, శివ, చంద్రశేఖర్, మరియు ఇతరులు పాల్గొన్నారు.