రాజపులోవలో గడపగడపకు జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: భోగాపురం మండలంలోని రాజపులోవలో గడపగడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా లోకం మాధవి శనివారం పర్యటించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మాధవి గడపగడపకి పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడాలంటే జగన్ వద్దు.. పవనే ముద్దు అనే నినాదం ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈసారి అందరూ ఒక తాటి మీదకు వచ్చి జనసేన పార్టీకి తమ మద్దతు తెలియజేయలని కోరారు. రాజపులోవ గ్రామస్తులు ఎవరికీ భయపడొద్దని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మీ అందరికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో భోగాపురం సీనియర్ నాయకులు పల్లా రాంబాబు, పళ్ళంటల జగదీష్ మరియు తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.