ఉమ్మడి గుంటూరు జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా శిఖ బాలు

గుంటూరు: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ గా శిఖ బాలు ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శిఖ బాలు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ బన్నీ వాసు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు పిఏసి సభ్యులు శ్రీ నాగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు.