సాయిలోకేష్ ని కలిసిన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్ కుమార్ ని రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. సాయిలోకేష్ యల్లటూరు శ్రీనివాస రాజుని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ మీద ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్, అరిగె రాం ప్రసాద్, పిండిబోయిన కృష్ణ, జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నారదాసు రామచంద్ర, మౌల తదితరులు పాల్గొన్నారు.