జ్యోతుల కాలనీలో ఉపాధి కోసం యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో స్థానిక 13వ డివిజన్ సాంబమూర్తి నగర్, జ్యోతుల కాలనీ సమీపంలో పాలిక శివ ఆధ్వర్యంలో మన ఊరు మన కాకినాడ లొనే ఉపాధి కోసం యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ సహజసిద్ధంగా ఏర్పడిన పోర్ట్ కాకినాడకు తలమానికమనీ తరతరాలుగా ఈ పోర్ట్ ఈ సాంబబూర్తినగరంకి సమీపంలో ఉన్నా నేడు స్థానిక యువతకి ఉపాధి లేక కునారిల్లుతున్నారనీ కాకినాడ యువతకి కాకినాడలో ఉపాధి పొందడం జన్మతహా వారి హక్కు అనీ వై.సి.పి వారు ఇక్కడి భూములు కబ్జాలకీ, పనులు లాక్కోడానికీ, కాంట్రాక్టులు తెచ్చుకోడానికి సిద్ధం తప్ప యువతకి ఉపాధి కల్పించడానికి కాదనీ, ఇలాంటి పాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పేందుకు మేము సిద్ధం అని నినాదాలు చేసారు. జనసేన పార్టీ స్థానిక యువతకి స్థానికంగా ఉపాధి పొందేలా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాకినాడలో పరిశ్రమలను వృద్ధిచేసి, డీప్ వాటర్ పోర్ట్ అభివృద్ధిచేసి పోర్టులో కార్యకలాపాలు పెంచి ఉపాధి కల్పించేలా బాధ్యత జనసేనపార్టీ తీసుకుంటాదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, సిటీ జనరల్ సెక్రెటరీ రమణారెడ్డి, పాలిక శివ, సలీం, చొల్లంగి శ్రీను, దవులూరి శ్రీను, కొమ్మన సురేష్, పాలిక వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.