జనసేన పార్టీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

నరసాపురం నియోజకవర్గం: దర్భరేవు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కొరిపల్లి వాసు, మల్లాది శ్రీనివాసు, మల్లాది చెంచయ్య, కొప్పాడి నరసింహస్వామి, కొట్ల వనమరాజు, మల్లాది నాని, కొల్లు సాయి, మల్లాది హేమ సాయి, కొప్పాడి సత్యనారాయణ, తిరుమాని ఏడుకొండలు, మల్లాది శ్రీను, మల్లాది దుర్గాప్రసాద్, మల్లాది వెంకటేశ్వరరావు, మల్లాది దుర్గారావు, మల్లాది పుల్లయ్య, కొల్లు వలవరాజు, కడలి దిలీప్ కుమార్ మరియు దాదాపుగా 50 మంది కొల్లు జయరాజు ఆధ్వర్యంలో, టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.