జనసేనతో సామాజిక న్యాయం: రాటాల రామయ్య

సిద్ధవటం: జనసేనతో సామాజిక న్యాయం జరుగుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. జనసేన ఇంటింటి ప్రచారం 18వ రోజులో భాగంగా మాధవరం-1 పంచాయతీలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ యువ నాయకుడు పొలిశెట్టి శ్రీనివాసులు, కిషోర్, జనసేన వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.