జనసేనతోనే సామాజిక న్యాయం: డా.కందుల నాగరాజు

విశాఖ దక్షిణ నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి ఆవిర్భవించిన జనసేన పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. కందుల నాగరాజు ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం ఆదివారం నాటికి 12వరోజుకు చేరుకుంది. 39వ వార్డులో చిలకపేట, లక్ష్మీ టాకీస్, కురుపాం మార్కెట్ వంటి ప్రాంతాలలో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను చేపడుతున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి వస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇదే విషయం ప్రజలు కూడా నేరుగా చెబుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల సమయంలో ప్రజలు భావించినట్లే జనసేన మెజార్టీ సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని తెలిపారు. జనసేన పార్టీ పట్ల ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తెలుగు అర్జున్, తెలుగు లక్ష్మి, రఘు, త్రినాధ్, ప్రణీత్, హరినాథ్, గాజులు శ్రీను, పవన్ సాయి, అశోక్, దుర్గా, కుమారి, సూరి, మనోజ్, హరిప్రసాద్, మణి, రాజేశ్వరి, వెంకటి, అలేఖ్య, కేదార్ నాథ్, బద్రీనాథ్, పలువురు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.