సేవా తత్పరుడు సుంకర రమేష్ కు ఘన సన్మానం
పి గన్నవరం నియోజకర్గం, అయినవెల్లి మండలంలో కొడుకుదుమూరు గ్రామానికి చెందిన గుర్రాల రమాదేవి జనసేన పార్టీ ఎం.పీ.టీ.సీ కుమార్తెకు ఇటీవల సుంకర రమేష్ తన సొంత ఖర్చులతో ఊపిరితిత్తుల సంబంధించిన ఆపరేషన్ చేయించారు. ఈ సందర్భంగా శనివారం సుంకర రమేష్ ను అక్కడి ప్రజలు ఘనంగా అతిధి సత్కారాలతో.. అయినవెల్లి వినాయకుడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి.. అనంతరం సన్మానిచారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆయన అశయాలకు అనుగుణంగా సుంకర రమేష్ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు అని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, జనసైనికులు పాల్గొన్నారు.
అదేవిధంగా రాజోలు నియోజక వర్గంలో జనసేన వైస్ ఎం.పీ.పీ ఇంటుపల్లి ఆనంద రాజు కుమార్తె చదువు నిమిత్తం 50 వేల రూపాయలు సుంకర రమేష్ డిపాజిట్ చేశారు. సాదారణ జనసైనికుల కోసం సుంకర రమేష్ చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకుని రాజోలు నియోజకవర్గంలో కాట్రేనిపాడు జనసేన ప్రెసిడెంట్ ఆద్వర్యంలో శ్రీ కాటుమాయమ్మ ఆలయంలో పూజలు జరిపించి.. జనసేన ప్రెసిడెంట్ అడబాల శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు, జనసైకులు ప్రత్యేకంగా సుంకర రమేష్ ను అభినందిచారు. మలికిపురం మండల ఎం.పీ.పీ శ్రీమతి మేడిచేర్ల వెంకట సత్యవాణి సుంకర రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.