భైంసా పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో నేతాజీకి ఘననివాళులు

నిర్మల్, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎపి నగర్ కాలోనిలో నిర్వహించటం జరిగింది నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి యువకులు స్వీట్స్ ను పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ, మీరు దేశం కోసం రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అన్న గొప్ప దేశ భక్తుడు నేతాజీ, యువకులను సైన్యంలో చేర్చి దళపతిగా ఉండి దేశం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి బ్రిటిష్ వలస పాలనను దిక్కరించిన భారతీయ జాతీయ వాది భారతీయుల్లో హీరోగా మారిన ఆయన్ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానే సాయినాథ్, ప్రవీణ్, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.