ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని పదవులు ఎందుకు?: నందొలి మురళికృష్ణ

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసైనికులు: మినుములూరు గ్రామంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందొలి మురళికృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్ల కోసం హడావిడి చేస్తూ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిన ప్రజా ప్రతినిధులు ఎక్కడున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించలేని పదవులు అవసరమా అని అని తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపన చెప్పలని అధికార పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడేరు మండల కేంద్రములో మినుములురు గ్రామంలో, జనసైనికులు పర్యటించారు, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మేజర్ గ్రామ పంచయతీ పరిధిలో కొన్ని విధుల్లో ఇప్పటికీ ప్రజలు ముళ్ళపొదల మధ్య జీవనం సాగిస్తున్నారని ప్రజలకు నెరవేర్చాలేని హామీలు ఇస్తూ, మోసం చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు అభివృద్ధి చెందేది నాయకుల ఆస్తులు మాత్రమేనని ప్రజలు మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచి మోసపోతూన్నారని అన్నారు, విష సర్ఫాల బారిన పడి పాముకాటుకు గురైన వారు, ఎందరో సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మినుములురు గ్రామంలో వైసీపీ పార్టీ గడప గడప కార్యక్రమంలో సమస్యలు ఉన్నాయి మంచినీటి సౌకర్యం కల్పించాలని, నీరు కలుషితం వల్ల అనారోగ్యలకు గురిఅవుతున్నారు అని గ్రామస్తులు తెలియచేసినప్పటికి త్వరలోనే మంచి నీటి సమస్య నెరవేరుస్తామని హామీ ఇచ్చి, సమస్య గాలిలొ దీపంలా వదిలేసి ఏదో గొప్పలు చెప్పడానికే ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అని తెలిపారు. అలాగే ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించలేని మరుక్షణం నిరశన కార్యక్రమం బలంగా ముందుకు తీసుకెళ్ళి కాళి బిందెలతో ఐ.టీ.డీ.ఏ ముట్టడి చేసి నిరశన తెలియజేస్తాం అని డిమాండ్ చేశారు. అలాగే కనీస సౌకర్యాలు లేని పరిస్థితులు నెలకొన్నాయనిప్రజలు అభివృద్ధికి నోచుకోలేక ఆగ్రహంతో ఉన్నారని వారి జీవనం అరణ్యమో స్మశానమో అన్న చందంగా తయారైందని అధికార పార్టీ చేస్తున్న గడప గడప కార్యక్రమంలో ప్రజలు నాయకులను నిలదీస్తున్న తీరే సాక్ష్యమని అన్నారు, అలాగే మండల నాయకులు వంపూరూ సురేష్ మాట్లాడుతూ సీసీ రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని లేనిచో ప్రజల సహకారంతో జనసేన పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అలాగే గ్రామస్తులకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తెలియజేసి నిత్యమైన పరిపాలన విధానం అమల్లోకి రావాలంటే మచ్చలేని ప్రజా నాయకుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ గారినీ ముఖ్యమంత్రి చేసే విధంగా మార్పుకు గ్రామస్తులు అండగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందొలి మురళికృష్ణ, మండల నాయకులు వంపూరూ సురేష్, కించే దేవేంద్ర ప్రసాద్, మర్రి అశోక్, గెమ్మెలి కృష్ణ, పాంగి ప్రసాద్, వార్డ్ మెంబర్, గ్రామస్తులు పూజారి గంగమ్మ, కొర్ర శాంతి, లలిత, అనేక మంది జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.