సూళ్ళూరుపేటలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం

సూళ్ళూరుపేట నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాయుడుపేటలో మూడు మండలాల క్రియాశీలక కార్యకర్తలతో ఆత్మీయసమావేశం జరిగింది. క్రియాశీలక కార్యకర్తలకు జనసేన 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అధికార పార్టీ వైఫల్యాల గురించి మరియు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిరణ్, బాలు, మురళి, శ్రీను, సుబ్బరాజు, మహేష్, కళ్యాణ్ పాల్గొన్నారు.