శ్రీ చింతలమ్మ తల్లి వారి జాతరలో పాల్గొన్న గురుదత్

  • జాతర మహోత్సవానికి ₹5016 రూపాయలు విరాళం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామ దేవత శ్రీ చింతలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు మరియు కలవచర్ల జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.